ఏపీలో జగన్ సునామీ

Update: 2019-05-23 04:28 GMT

ఏపీలో జగన్ సునామీ స్పష్టంగా కన్పిస్తోంది. ఊహించినట్లుగానే వైసీపీ ఆంద్రప్రదేశ్ లో విజయబావుటా దిశగా పయనిస్తోంది. గురువారం మధ్యాహ్నాం 12.30 గంటల సమయానికి వైసీపీ 149 సీట్ల ఆధిక్యతతో దూసుకెళుతోంది. అధికార టీడీపీ కేవలం 25 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. మొదటి నుంచి ఏపీలో సర్వేలు అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లే చూపించాయి. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే పరిస్థితి. వీటి అన్నింటిని నిజం చేస్తూనే ఏపీలో వైసీపీ దూసుకెళుతోంది.

పార్లమెంట్ స్థానాల విషయంలోనూ వైసీపీదే హవా కన్పిస్తోంది. వైసీపీ ఏకంగా 24 లోక్ సభ స్థానాల్లో లీడ్ లో ఉండగా..టీడీపీఒక చోట మాత్రమే లీడ్ లో ఉంది. తుది ఫలితాలు వచ్చేసరికి వీటిలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా వైసీపీ గెలుపు మాత్రం ఇక లాంఛనమే అన్న విషయం స్పష్టం అవుతోంది. వైసీపీ విజయం ఖాయం కావటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. ఈ నెల 25న వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇప్పటివరకూ అందుతున్న వార్తల ప్రకారం జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల30న ప్రమాణ స్వీకారం చేేసే అవకాశం ఉంది.

Similar News