తిరుపతిలో జగన్ ప్రమాణ స్వీకారం

Update: 2019-05-23 09:39 GMT

వైసీపీ అధినేత ఈ నెల30న తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేయున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.అమరావతి ప్రాంతంలో కాకుండా జగన్ తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకోవటం విశేషం. ప్రమాణ స్వీకారానికి ముందు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరమే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏకంగా వివిధ పథకాల కింద ప్రజలకు 30 వేల కోట్ల రూపాయలను పంచిపెట్టినా కూడా ఏపీ ప్రజలు జగన్ కు బ్రహ్మారథం పట్టారు.

175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఏకంగా 150కిపైగా స్థానాల్లో గెలిపించారని ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు.‍ చంద్రబాబునాయుడు దోపిడీ పాలనతో విసుగెత్తిన ప్రజలు.. ఆయన పరిపాలన వద్దంటూ తమ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఎంపీ సీట్ల విషయంలోనూ వైసీపీ షాకింగ్ ఫలితాలను సాధించింది. ఎగ్జిట్ పోల్స్ లో కేవలం 18 నుంచి 20 సీట్లు మాత్రమే వస్తాయని అంచనాలు వెలువడగా..ఏకంగా వైసీపీ 25 స్థానాలు దక్కించుకునే దిశగా సాగుతోంది.

 

 

 

 

Similar News