‘మహర్షి’ కొత్త పాట వచ్చేసింది

Update: 2019-04-29 03:59 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ విడుదలకు ముహుర్తం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచింది. అందులో భాగంగా తాజా మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. ‘ఏవో గుసగుసలే నాలో. వలసే విడిసి వలపే విరిసే ఎదలో. పాల పిట్టలో వలపు. నీ పైట మెట్టుపై వాలిందే. ’ అంటూ సాగే పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. మహేష్ బాబుకు స్నేహితుడుగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కన్పించనున్నారు. మే9న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

https://www.youtube.com/watch?v=P_wMsPd1zzk

Similar News