సాక్ష్యాత్తూ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధే ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పగిలిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. జనసేన తరపున బరిలో నిలిచిన మధుసూధన్ గుప్తా ఆగ్రహంతో ఈ పనిచేశారు. ఓటింగ్ ఛాంబర్లలో అసెంబ్లీకి ఎక్కడ, పార్లమెంట్ కు ఎక్కడ ఓటు వేయాలని స్పష్టంగా రాయలేదని ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆయన్ని సముదాయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈవీఎంను పగలగొట్టడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.