ప్రత్యేక హోదా దేవుడి దయా?

Update: 2019-04-08 07:23 GMT

ఏపీకి అత్యంత కీలకమైన ‘ప్రత్యేక హోదా’ను దేవుడి దయకు వదిలేస్తావా? అంటూ ప్రతిపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అలా అని మ్యానిఫెస్టోలో పెట్టడం దారుణమన్నారు. వైసిపి మేనిఫెస్టోతోనే మోదీ, కెసిఆర్ లతో జగన్ ములాఖత్ బయటపడిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా హోదాపై చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు’’. దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిద్దాం’’ అనడం జగన్ వెటకారం. నదుల అనుసందానం మేనిఫెస్టోలో పెట్టడానికి జగన్ కు భయం. కెసిఆర్ భయంతోనే పోలవరం, అమరావతిపై మేనిఫెస్టోలో పెట్టలేదు. నాగార్జున సాగర్, శ్రీశైలంపై పెత్తనం కెసిఆర్ కు అమ్మేశాడు. కృష్ణా- గోదావరి జలాలను టిఆర్ ఎస్ కు తాకట్టుపెట్టాడు జగన్ అని చంద్రబాబు ఆరోపించారు.

సోమవారం పార్టీ నేతలో టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. వైసిపికి ఓటేస్తే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు. హైదరాబాద్ నుంచి అమరావతికి పరిశ్రమలు వచ్చేస్తాయని కెసిఆర్ భయం. కెసిఆర్,మోది డిక్టేషన్ తోనే వైసిపి మేనిఫెస్టో అని ఆరోపించారు. ఓటమి భయంతో మోడీ జగన్ లో ప్రస్టేషన్ పీక్ కు చేరిందని ధ్వజమెత్తారు. నీళ్లకు పార్టీ ఉంటుందా..? వైసిపి నీళ్లు-టిడిపి నీళ్లు ఉంటాయా..? నీళ్లు పట్టుకునే ఆడబిడ్డపై కనికరం లేకుండా కొడవలితో నరకుతారా..? వైసిపి నేతలు నరరూప రాక్షసుల్లా మారారు..? ఇటువంటి రాక్షస పార్టీకి ఎవరైనా ఓట్లు వేస్తారా..? వైసిపికి ఓట్లేస్తే జనాన్ని బతకనిస్తారా.? ఆస్తుల్ని ఉండనిస్తారా? ఇళ్లపై పడి విధ్వంసాలు చేస్తారా..? ప్రహరీగోడలు కూల్చేస్తారా..? అంటూ విమర్శించారు.

 

 

Similar News