విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా

Update: 2019-04-16 14:40 GMT

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి. నేతల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు ఒకెత్తు అయితే..అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎం చంద్రబాబాబునాయుడు ఏకంగా కోవర్ట్ అని వ్యాఖ్యానించటం పెద్ద దుమారమే రేపింది. ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ లు మంగళవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి ఫిర్యాదు చేశారు. సర్వీసులో ఉన్న అధికారులు కూడా ఈ వ్యవహారంపై గరం గరంగా ఉన్నారు. తాజాగా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏ బీ వెంకటేశ్వరరావు రంగంలోకి వచ్చారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని..ఇది ఏ మాత్రం సరికాదన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఎవరితోనూ వ్యాపార సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ఈ ప్రగతి ప్రాజెక్టుతో కూడా తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు, సంస్థలతో తాను కానీ..తన కుటుంబ సభ్యులు ఎవరూ భాగస్వామ్యం కలిగి లేమన్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్న హేయమైన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

Similar News