టీడీపీకి వరస షాక్ లు

Update: 2019-03-30 07:09 GMT

ఎన్నికలకు ఇంకా పట్టుపని పక్షం రోజులు కూడా లేని సమయంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. ఈ పరిణామాలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. టీడీపీ కడప జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టగా..ఇప్పుడు అక్కడే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొంత కాలం క్రితం టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ శనివారం నాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీ తరపున రాజంపేట సీటు ఆశించారు. సీటు ఇవ్వకపోవటంతో పార్టీలో సముచిత గౌరవం ఇవ్వటంలేదనే కారణంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు.

అయితే మరి ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గతంలో వైసీపీ టిక్కెట్ పై గెలిచి తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. ఇఫ్పుడు తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరుకున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాందీ తిరిగి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు ఎమ్మిగనూరులో జగన్ సభలో ఆయన వైసిపి కండువా కప్పుకున్నారు. టిడిపి ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు.

Similar News