జనసేనకు షాక్

Update: 2019-03-17 04:42 GMT

అధికార తెలుగుదేశం పార్టీకే కాదు..జనసేనకు కూడా షాక్ తగిలింది. ఏకంగా పార్లమెంట్ సీటు కేటాయించినా కూడా ఆయన పార్టీ మారటం విశేషం. ఈ చివరి నిమిషం జంపింగ్ లు ఎందుకు అన్నది పెద్ద సందేహస్పదంగా మారింది. అధికార టీడీపీలోనూ ఇలాగే జరిగింది. ఎంపీ సీటు ఇస్తామన్నా వద్దని మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే టిక్కెట్ ఇఛ్చిన తర్వాత కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని కాదని వైసీపీలో చేరటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్‌ శ్రీనుబాబు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తొలి జాబితాలోనే గేదెల శ్రీనివాస్‌ పేరును ప్రకటించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు జగన్ ఎక్కడ సీటు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.

 

Similar News