పవన్..చంద్రబాబు ‘సేమ్ టూ సేమ్’

Update: 2019-03-23 10:57 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఇద్దరిదీ ఒకటే లైన్’. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో..అచ్చం పవన్ కళ్యాణ్ అదే మాట్లాడుతున్నారు. శనివారం నాడు నూజివీడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ నోట చంద్రబాబు మాటలే వచ్చాయి. అవేంటి అంటే?. ఏపీలో వైసీపీ గెలిస్తే కెసీఆర్ గెలిచినట్లేనంట?. వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతిన్నట్లేనని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వరంగల్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల తో కొట్టి తరిమారని..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరుషం లేదా? తెలంగాణ నేతలకు బానిసలమా అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు ఏమీ చేయని జగన్..ముఖ్యమంత్రి అయితే ఏమి చేస్తారని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి సవ్తే నూజివీడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చినా తన పేరు మీద ఒక్క పథకం కూడా ఉండదని ప్రకటించారు. డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేద్దామని పిలుపునిచ్చారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెబుతున్న కెసీఆర్ అలా చేయాలనుకుంటే ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని కోరారు. యువత జనసేన వైపే ఉందన్నారు. జనమే జనసేన బలమన్నారు. అధికారంలోకి రాగానే ఉచిత విద్యా పథకం అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌, భోజన సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు.

Similar News