జనసేనలో చేరిన నాగబాబు..ఎంపీ బరిలో

Update: 2019-03-20 07:39 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదీ సొంత తమ్ముడి పార్టీ అయిన జనసేనలో చేరారు. పార్టీలో చేరటమే కాదు..ఏకంగా నరసాపురం లోక్ సభ నుంచి బరిలోకి దిగనున్నారు. అలా పార్టీలో చేరారో లేదో..ఆయనకు వెంటనే టిక్కెట్ కూడా ప్రకటించేశారు. ఈ విషయాన్ని జనసేన ప్రకటించింది.

గత కొంత కాలంగా నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏపీ ప్రభుత్వంపైన..మీడియా సంస్థలపైనా వ్యంగస్త్రాలు సంధిస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. టీడీపీపై విమర్శల విషయంలో నాగబాబు దూకుడుగా ఉంటే..ఈ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం స్పీడ్ తగ్గించారు. పార్టీలో చేరిన..ఎంపీ బరిలో నిలిచిన నాగబాబు రాబోయే రోజుల్లో ఎలా విమర్శలు చేస్తారో వేచిచూడాల్సిందే.

Similar News