వైసీపీలో చేరిన అలీ

Update: 2019-03-11 04:52 GMT

ప్రముఖ నటుడు అలీ వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ లోన లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. గత కొన్ని రోజులుగా అలీ టీడీపీలో చేరతారా? లేక వైసీపీలో చేరతారా? అన్న చర్చ జోరుగా సాగింది. ఈ చర్చలకు పుల్ స్టాప్ పెడుతూ అలీ వైసీపీ జెండా పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం అమరావతిలో సినీ నటుడు అలీకి జరిగిన సన్మాన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

2019 ఎన్నికల ప్రచారంలో దిగి జగన్ ను సీఎంను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను. జగన్ అధికారంలోకి వస్తే ఎంతో బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పాను. పాదయాత్ర సందర్బంగా ఇప్పటికే టిక్కెట్ల హామీ ఇచ్చానని..ఇప్పుడు వాళ్ళను కాదని సీటు ఇస్తే సరికాదని జగన్ తనకు చెప్పారన్నారు. తాను ఇప్పుడు పోటీ చేయటంలేదని..వైసీపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రచార షెడ్యూల్ పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటుందని తెలిపారు.

Similar News