నెరవేరిన ‘ఎర్రబెల్లి’ కల

Update: 2019-02-19 06:16 GMT

ఎట్టకేలకు ఎర్రబెల్లి దయాకర్ రావు కల నెరవేరింది. రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాలనే ఆయన ఆయన కోరికకు ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. టీడీపీలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆయనకు కడియం శ్రీహరి బ్రేకులు వేసేవారు. దీంతో ఆయన మంత్రి పదవి ఆశ అలా సాగుతూ వచ్చింది. ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎర్రబెల్లి కల నెరవేరింది. సీఎం కెసీఆర్ ఈ సారి కడియం శ్రీహరిని పక్కన పెట్టి మరీ ఎర్రబెల్లికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆయన ఫుల్ కుషీకుషీగా ఉన్నారు. ఎంతో కాలం ఎదురుచూసిన మంత్రి పదవి దక్కటంతో ఎర్రబెల్లి భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. గతంలో తనకు ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానని అన్నారని ...కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదని తెలిపారు. చంద్రబాబు తనను మంత్రిని చేస్తానని మాటతప్పారని ఆరోపించారు. కేసీఆర్ మాత్రం తనకు ఇచ్చిన మాట ను నిలబెట్టుకున్నారని తెలిపారు.

Similar News