తెలుగుదేశం పార్టీకి మరో షాక్

Update: 2019-02-15 06:13 GMT

అధికార తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ లు ఎదురవుతున్నాయి. వరస పెట్టి పార్టీ నేతలు..ప్రతిపక్ష వైసీపీలోకి చేరుతుండటంతో ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. ఓ వైపు పార్టీ మారాలనుకునే నేతలను స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుజ్జగిస్తూనే అవి విఫలం అవుతుండటంతో వాళ్ళు పార్టీని వీడటం వల్ల పెద్దగా నష్టం ఏమీలేదంటూ పైకి మాత్రం గాంభీర్యం ప్రకటిస్తున్నారు. తాజాగా వెలువడిన వార్త మాత్రం టీడీపీని మరింత కలవరపర్చేదే.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోకీలక వ్యక్తిగా ఉన్న విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన్ను వైసీపీ విజయవాడ ఎంపీ బరిలో నిలపనుందని చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లోటస్‌‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

 

Similar News