ఖమ్మం టీడీపీ ఖాళీ కానుందా?

Update: 2019-01-08 15:17 GMT

ఖమ్మం తెలుగుదేశంలో మళ్లీ కలకలం. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ గెలిచిన రెండు సీట్లూ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఖాళీ అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, ఎం నాగేశ్వరరావులు టీఆర్ఎస్ లోకి చేరే అవకాశం ఉందనే ప్రచారం మరోసారి ప్రారంభం అయింది. ఇప్పటికే సండ్ర స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ లో చేరటానికి రెడీ అంటూ సండ్ర సంకేతాలు ఇచ్చారు.

ఇప్పుడు అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. దీంతో ఈ చర్చ మళ్ళీ ప్రారంభం అయింది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చే బాధ్యతలను సీఎం తన సన్నిహితులకు అప్పగించినట్టు చెబుతున్నారు. తాజాగా తమ్మలతో మెచ్చా భేటీ కావడంతో.. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Similar News