హైకోర్టుకు హీరో ప్రభాస్

Update: 2018-12-19 07:41 GMT

టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు కనీసం నోటీసులు ఇవ్వకుండా తన గెస్ట్ హౌస్ ను సీజ్ చేయటంపై ఆయన కోర్టుకు వెళ్లారు. ఆయన పిటీషన్ పై కోర్టు వెంటనే విచారణ జరిపించే అవకాశం ఉందని సమాచారం. నగర శివార్లలోని రాయదుర్గం లోని పైగా భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

అదే సమయంలో అక్కడే ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్ ను సీజ్ చేస్తూ గేటుకు నోటీసులు అంటించారు. ఈ గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలమని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ భూమి కాదని, అధికారులు అక్రమంగా స్వాదీనం నోటీసు ఇచ్చారని ఆయన వాదిస్తున్నారు.

Similar News