పది మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ రెండవ జాబితా వచ్చేసింది. తొలి జాబితాలో మొత్తం 65 మంది అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా జాబితాతో మొత్తం 75 మంది అభ్యర్ధులను ప్రకటించినట్లు అయింది. మిగిలిన సీట్లకు అభ్యర్ధులు కూడా బుధవారం రాత్రికే వెల్లడయ్యే అవకాశం ఉంది. కొత్తగా టిక్కెట్లు దక్కించుకున్న వారి జాబితా ఇలా ఉంది.
ఖానాపూర్: రమేష్ రాథోడ్
ఎల్లారెడ్డి : జాజల సురేందర్
ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్కుమార్
సిరిసిల్ల: కేకే మహేందర్రెడ్డి
మేడ్చల్ : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ఖైరతాబాద్: దాసోజు శ్రవణ్
జూబ్లీహిల్స్: విష్ణువర్ధన్ రెడ్డి
షాద్ నగర్: ప్రతాపరెడ్డి
భుపాల్ పల్లి: గండ్ర వెంకట రమణారెడ్డి
పాలేరు: ఉపేందర్రెడ్డి