జనసేన కు ఎవరితో పొత్తు లేదు

Update: 2018-10-28 15:05 GMT

జనమే మా బలం..ఆ బలంతోనే ప్రభంజనం సృష్టిస్తాం అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి ఎవరి అండ దండా అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పష్టత ఇఛ్చారు. జనసేన వాళ్ళతో కలుస్తుంది..వీళ్ళతో కలుస్తుంది అంటూ ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారని..అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. అదిగో పులి..ఇది తోక అన్నట్లు చేయటం సరికాదని.. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని మరికొందరు ప్రచారం చేస్తున్నారని..ఇందులో ఏ మాత్రం నిజంలేదన్నారు.

Similar News