రాహుల్ ను ‘లోఫర్’ అంటున్న బిజెపి నేత

Update: 2018-07-24 05:25 GMT

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోడీని కౌగిలించుకోవటం..ఆ తర్వాత తన సీట్లో కూర్చుని కన్నుగీటడంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. గోవాకు చెందిన బిజెపి అధికార ప్రతినిధి దత్తప్రసాద్ నాయక్ ఈ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. లోఫర్లు మాత్రమే ఇలా కన్నుగీటుతారని వ్యాఖ్యానించారు. అంతే కాదు... కాలేజీల్లో, రోడ్లపై అమ్మాయిలను ఏడిపించే లోఫర్లే ఇలా చేస్తారని ధ్వజమెత్తారు.

భారత ప్రజల సమస్యలను, కష్టాలను అర్థం చేసుకోలేని వ్యక్తే ఇలా ప్రవర్తిస్తారంటూ రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొలువుదీరిన పవిత్రమైన ఆలయం(పార్లమెంటు)లో రాహుల్‌ చేసిన పనులు చాలా అవమానకర రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం చేతుల్లో తోలుబొమ్మల్లా మారిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు వాళ్లు చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు.

Similar News