పవన్ కళ్యాణ్ కు లీగల్ నోటీసులు

Update: 2018-04-21 10:53 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మీడియా అధినేత శ్రీనిరాజు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు. పవన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నోటీసులో పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తానని ప్రకటించిన పవన్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదన్నారు. శ్రీనిరాజుకు ఏ రకంగా చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సంబంధం లేదన్నారు.

శ్రీనిరాజు వర్మతోపాటు రవిప్రకాష్ తో కలసి టీడీపీ నేతలకు సాయం చేస్తున్నారనేది సరికాదన్నారు. తన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలపై పవన్ ఎలా బాధపడ్డారో..తన క్లయింట్ కూడా పవన్ నిరాధార ఆరోపణలకు బాధపడినట్లు తెలిపారు. ఈ నోటీసులపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలైన అజ్ఞాతవాసి మీ సీఈవో రవిప్రకాషే అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మీ పొలిటికల్ బాస్ లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. గుడ్ లక్ శ్రీని అంటూ పేర్కొన్నారు.

 

Similar News