మోడీని ఫాలో అయిన చంద్రబాబు

Update: 2018-04-03 05:52 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన మంగళవారం నాడు పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి..సభలోకి అడుగు పెట్టారు. అయితే సభలోకి ప్రవేశించే ముందు గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి పార్లమెంట్ మెట్లకు నమస్కరించారు. తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ లోకి ప్రవేశించే సమయంలో ఇలాగే చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు పార్లమెంట్ ప్రాంగణంలోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో ఎన్నోసార్లు ఆయన పార్లమెంట్ ప్రాంగణంలోకి వెళ్లారు. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. కానీ ఈ సారి చంద్రబాబు పార్లమెంట్ ప్రాంగణం వద్ద మెట్లకు నమస్కరించి లోపలికి వెళ్లటం ఆసక్తికర పరిణామంగా మారింది. ఒక సారి పార్లమెంట్ మెట్లకు నమస్కరించి... మీడియా కోరటంతో మళ్ళీ రెండోసారి కూడా చంద్రబాబు పార్లమెంట్ మెట్లకు నమస్కరించి.. ముందుకు సాగారు. సెంట్రల్ హాల్ లో ఆయన పలు పార్టీలకు చెందిన నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

 

 

 

 

 

Similar News