ట్విట్టర్ బాటలో పేస్ బుక్

Update: 2023-02-20 09:01 GMT

Full Viewఫస్ట్ ఫ్రీ అంటారు. తర్వాత నామమాత్రపు చార్జీలు అంటారు. అలా అలవాటు చేస్తారు. ఒకసారి జనాలు అందరూ దానికి అడిక్ట్ అయ్యాక..అది లేకుండా ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. అప్పుడు అసలు విశ్వరూపం చూపిస్తారు. దేశీయ కంపెనీ జియో అయినా విదేశీ కంపెనీలు ట్విట్టర్, మెటా లు అయినా అందరిది ఒకటే మోడల్. ట్విట్టర్ బాటలో ప్రయాణించడానికి పేస్ బుక్ కూడా రెడీ అయింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత వెరిఫైడ్ ఖాతాలకు ఛార్జ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పేస్ బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయం తీసుకుంది. అయితే పేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లకు కలిపి ఒకే ఛార్జ్ చేయనుంది. తొలుత ఈ సేవలను ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ల్లో అమలు చేయనున్నారు.

భారతీయ కరెన్సీలో చూస్తే ఈ మొత్తం నెలకు వెయ్యి రూపాయలకు పైనే ఉంటుంది. మరి ఇండియా లో ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. వెరి ఫైడ్ ఖాతాలకు ఛార్జ్ చేయటం మాత్రం పక్కా అని తేల్చారు.. అయితే క్రమంగా ఒక్కో దేశం లో ఇది అమలు చేసుకుంటూ రానుంది. ప్రకటనల ఆదాయం తగ్గటం పేస్ బుక్ కూడా ఈ మోడల్ వైపు వచ్చింది అని చెపుతున్నారు. ఇప్పటికే మెటా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. వెరి ఫైడ్ ఖాతాలకు నకిలీల బెడద తప్పటం తో పాటు పలు ప్రత్యేకతలు ఉంటాయని చెపుతున్నారు. తర్వాత సాధారణ యూజర్లకు కూడా నామమాత్రపు ఫీజు పెట్టె అవకావం ఉందని చర్చ సాగుతోంది. అలా చేసిన కంపెనీకి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని అంచనా. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో.

Tags:    

Similar News