వరద బాధితుల కోసం మెఘా పది కోట్ల విరాళం

Update: 2020-10-19 13:48 GMT

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కెసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి బాధిత కుటుంబానికి పది వేల రూపాయల నగదు సాయానికి నిర్ణయం తీసుకుంది. సీఎం కెసీఆర్ పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్, అండ్ ఇన్ఫ్రా సంస్థ వెంటనే స్పందించింది. సీఎం సహాయనిధికి పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు మద్దతుగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది.

Tags:    

Similar News