ప్రేమ వ్యవహారం..యువకుడి దారుణ హత్య

Update: 2020-10-20 05:41 GMT

ప్రేమ వ్యవహారం ఓ యువకుడిని బలికొంది. తాజాగా విజయవాడలో ఓ యువతిని దారుణంగా గొంతుపై కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మరవక ముందే మరో సంఘటన. కరీంనగర్ జిల్లాలో తాజా ఘటన చోటుచేసుకుంది. ప్రణయ్ అనే యువకుడిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నరు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రణయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత అమ్మాయి గత కొన్నేళ్లుగా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు.

దీంతో గతకొంత కాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రణయ్‌పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులతో పాటు గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రణయ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రణయ్‌ హత్య పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Tags:    

Similar News