ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన కర్ణాటక

Update: 2020-08-25 04:23 GMT

కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నుంచైనా ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశించే వారికి ఎలాంటి క్వారంటైన్..టెస్ట్ లు ఉండవు. విమానాలు..రైళ్లు, బస్సుల ఏ మార్గంలో అయినా రాష్ట్రంలోకి అడుగుపెట్టొచ్చు. ఇప్పటివరకూ 14 రోజుల క్వారంటైన్ ను తప్పనిసరిగా ఉండేది. దీంతో పాటు సేవాసింధు యాప్ లో నమోదు తప్పనిసరి చేశారు.

అయితే కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలతో తాజా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో కూడా ఎలాంటి పరీక్షలు చేయరు. అయితే అనుమానితులు ఎవరికి వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక సర్కారు సూచించింది.

Similar News