తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

Update: 2020-06-14 14:20 GMT

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు వరస పెట్టి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే కరోనా బారిన పడగా..ఆదివారం నాడు మరో ఎమ్మెల్యేకు ఈ వైరస్ నిర్ధారణ అయింది. ధీంతో ప్రజా ప్రతినిధుల్లో కలకలం మొదలైంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు ఎవరు దీని బారిన పడతారో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. తాజాగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా పాజిటివ్‌ అని వైద్యులు నిర్ధారించారు. ఆయన 3 రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయన శనివారం నాడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News