లాక్ డౌన్ సందర్భంగా పల్లెల్లోనే భౌతిక దూరం బాగా పాటిస్తున్నారని..పట్టణ యువతే మారాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా ఉంటూ కరోనా సోకకుండా చూసుకోవటమే ప్రస్తుతం ప్రజలందరూ చేయాల్సిన పని అన్నారు. మరో రెండు వారాలు ప్రజలు తెలంగాణ సర్కారుకు సహకరించాలని కోరారు. మంత్రి కెటీఆర్ బుధవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో సందర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా వైరస్ ను తట్టుకోలేకపోయిందన్నారు. అక్కడ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది.
కరోనా వైరస్ కు స్వీయ నియంత్రణ నే మందు. కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రత్తమైంది. జిల్లాలో ఓకే పాసిటివ్ కేసు నమోదైంది. మర్కజ్ ఘటన లేకపోతే ఇది కూడా ఉండేది కాదు. జిల్లాలో మళ్లీ కొత్త కేసు నమోదు కావద్దు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి. తెలంగాణ దేశానికే అన్నపూర్ణ. ఎండాకాలంలో కూడా మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. ప్రజలందరూ అధికారులకు సహకరించాలి. లేకపోతే చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే తెలంగాణను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించుకుందామన్నారు.