తెలంగాణలో కొత్తగా 28 కేసులు

Update: 2020-04-12 16:28 GMT

తెలంగాణలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 531కు పెరిగింది. ఆదివారం నాడు ఇద్దరు కరోనా కారణంగా మరణించగా..ఏడుగురు పేషంట్లు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో చికిత్స పొందుతున్న వారు 412 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారు 103 మంది ఉంటే..మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది.

రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 202 హాట్ స్పాట్లను గుర్తించినట్లు తెలంగాణ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే స్వయంగా ఆస్పత్రికి వచ్చి చూపించుకోవాలని సూచించారు.

 

Similar News