వైసీపీ సర్కారుపై పవన్ విమర్శలు

Update: 2019-11-10 12:22 GMT

ఏపీలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలనే సర్కారు నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘వైసిపి నాయకత్వం తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ముందస్తు విధానంతో వచ్చేవారు కాదు. వైసిపి నాయకత్వం తెలంగాణ సిఎం 'కెసిఆర్' నుండి పాఠాలు నేర్చుకోవాలి. భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి.

తెలుగు మహాసభలు 2017 లో హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసేసేందుకు సన్నాహాలు చేస్తూంటే ..ఏపీ అధికార భాషా సంఘం ఏం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాల తెలుగు మీడియం రద్దు చేయడం కారణంగా మన భాష సంస్కృతి మరుగున పడిపోతాయి.అందుకే పెద్ద బాలశిక్ష తెలుగు వ్యాకరణం ఆరుద్ర సమగ్ర సాహిత్యం శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి గొప్ప గొప్ప తెలుగు పుస్తకాలు నా లైబ్రరీ లో భద్రపరుచుకున్నాను’ అంటూ పుస్తకాలను ట్యాగ్ చేశారు.

 

 

 

Similar News