ఆమెను హోటల్ గదికి పిలవలేదు

Update: 2019-05-21 04:14 GMT

ఎం జె అక్భర్. మీటూ ఉద్యమంలో తీవ్రంగా విమర్శలపాలైన సీనియర్ జర్నలిస్టు..కేంద్ర మాజీ మంత్రి. ఆయనపై ఎంతో మంది మీటూ ఆరోపణలు చేశారు. చివరకు ఆయన కేంద్ర మంత్రి పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది ఈ ఆరోపణలతో. పదవి పోయినప్పటి నుంచి పెద్దగా వార్తల్లో కన్పించని ఎం జె అక్భర్ మీ టూ కేసులో కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన సోమవారం నాడు ఢిల్లీలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందుకు హాజరయ్యారు. తాను జర్నలిస్ట్ ప్రియారమణిని ఇంటర్వూ కోసం హోటల్ కు రావాల్సిందిగా పిలవలేదని తెలిపారు.

1994లో అక్బర్ ఏషియన్ ఏజ్ పత్రిక ఎడిటర్ గా ఉన్నారు. ఆ సమయంలోనే ఇంటర్వూ కోసం తనను హోటల్ గదికి పిలిచారని ప్రియా రమణి ఆరోపించారు. హోటల్ కు వచ్చిన సమయంలో ఆయన తనను లైంగికంగా వేధించారని పేర్కొన్నారు. అయితే కోర్టు విచారణ సందర్భంగా అక్భర్ ప్రియా చేసిన ఆరోపణలను తిరస్కరించారు. ఆమెను తాను అసలు హోటల్ గదికే పిలవలేదన్నారు.

 

Similar News