భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పాక్ భారత్ తో ఏ మాత్రం తలపడే పరిస్థితిలో లేదు. అలా అని మౌనంగా కూర్చుంటే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సీటు కింద ఎసరు రావటం ఖాయం. అందుకే కావాలని ఫేక్ న్యూస్ ప్రసారం చేయటం..సరిహద్దుల వెంబడి నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు తెగపడటం వంటి చర్యలకు పాల్పడుతోంది. దేశంలోని రక్షణ స్థావరాలపై పాక్ తన విమానాలతో దాడి చేసేందుకు ప్రయత్నించగా..భారత్ విజయవంతంగా ఆ ప్రయత్నాలను తిప్పికొట్టింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాజేసే పనిలో పడింది. ఓ వైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ను చర్చలకు ఆహ్వానిస్తున్నామంటున్న దాయాది దేశం మరోసారి కపట బుద్ధిని బయట పెట్టుకుంది.
భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాక్.. చర్చలకు సిద్ధమంటూనే మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గురువారం తెల్లవారుజామున నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పూంచ్లోని కృష్ణ ఘటీ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పులకు దిగింది. పాక్ పన్నాగాన్ని పసిగట్టిన భారత జవాన్లు ఇందుకు దీటుగా బదులిచ్చారు. సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిపి పాక్ సైన్యాన్ని తరిమికొట్టారు. ముందు జాగ్రత్త చర్యగా పాక్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలన్నీ మూసివేస్తున్నారు.