Telugu Gateway
Politics

ఫ్యాన్ కు ఓటేశారు..మీ ఇంట్లో ఫ్యాన్ ఆగింది

ఫ్యాన్ కు ఓటేశారు..మీ ఇంట్లో ఫ్యాన్ ఆగింది
X

వైసీపీ స‌ర్కారుపై టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యంగాస్త్రాలు సంధించారు.ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేసారు జగన్ రెడ్డి. ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి ప్యాలస్ లో నిద్రపోతున్న జగన్ రెడ్డిలో చలనం లేదు. రూ.200 కోట్లకు పైగా సొంత మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన మీరు, బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని చెల్లించకపోవడం దారుణం.

అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవడంలో జగన్ రెడ్డి బిజీ అవ్వడం వలనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది.' అంటూ పేర్కొన్నారు. విద్యుత్ కోత‌లు పెట్టాల్సి రావ‌చ్చొని..వినియోగంలో పొదుపు పాటించాల‌ని ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు గ‌త కొంత కాలంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ త‌రుణంలో టీడీపీ వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తోంది. టీడీపీ అధికారంలో ఉండ‌గా మిగులు విద్యుత్ ఉంటే..ఇప్పుడు త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో రాష్ట్రాన్ని చీక‌ట్లోకి నెట్టార‌ని ఆ పార్టీనేత‌లు ఎటాక్ చేస్తున్నారు.

Next Story
Share it