Telugu Gateway
Politics

చంద్రబాబువి దొంగ లెక్కలు

చంద్రబాబువి దొంగ లెక్కలు
X

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కూడా తాము రెడీగా ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి టీటీడీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నవి దొంగ లెక్కలు అని విమర్శించారు.. ఎన్నికల్లో గెలిచే దమ్ము, ధైర్యం టీడీపీకి లేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సహా టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం స్పష్టమైందని.. వైసీపీ మద్దతుదారులు ఘన విజయాలు సాధిస్తున్నారని వెల్లడించారు. మూడు, నాలుగో విడతల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని, చంద్రబాబు తానా అంటే కొన్ని ఛానల్స్‌, పత్రికలు తందానా అంటున్నాయని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు.

Next Story
Share it