గుంటూరు జైలు కు ఎంపీ రఘురామకృష్ణంరాజు
BY Admin16 May 2021 11:37 AM GMT
X
Admin16 May 2021 11:37 AM GMT
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం లో కీలక మలుపు. ఆయన్ను ఆదివారం సాయంత్రం గుంటూరు జైలుకు తరలించారు. ప్రభుత్వంపై కుట్ర చేశారనే ఆరోపనణలపై రఘురామకృష్ణంరాజును శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను శనివారం నాడు గుంటూరు కోర్టులో హాజరుపర్చిన విషయంలో తనను పోలీసులు కొట్టినట్లు ఎంపీ ఫిర్యాదు చేయటం కలకలం రేపింది. దీంతో కోర్టు ఈ ఫిర్యాదుపై మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి నివేదిక అందించాల్సిందిగా ఆదేశించింది. జీజీహెచ్ లో పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు.
Next Story