Telugu Gateway
Andhra Pradesh

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామకృష్ణంరాజు

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామకృష్ణంరాజు
X

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్నారు. సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన్ను గుంటూరు జైలు నుంచి సికంద్రాబాద్ తీసుకొస్తున్నారు . సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అది కూడా తెలంగాణ హైకోర్టు నియమించే న్యాయాధికారి సమక్షంలో ఈ పరీక్షలు జరగనున్నాయి.

జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగానే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలని పేర్కొంది. వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రఘురామను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Next Story
Share it