Telugu Gateway
Andhra Pradesh

పోలీసులు కొట్టారంటున్న రఘురామకృష్ణంరాజు!

పోలీసులు కొట్టారంటున్న రఘురామకృష్ణంరాజు!
X

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కలకలం రేపుతోంది. ఏపీసీఐడీ పోలీసులు ఆయన్ను శుక్రవారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ డిస్మిస్ అయింది. దీంతో రఘురామకృష్ణంరాజును గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. పోలీసులు తనను కాళ్లు వాచేలా కొట్టారని..శుక్రవారం రాత్రి నుంచి వేధింపులకు గురిచేస్తున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అదే సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు ను కోర్టులో హాజరు పర్చే సమయంలో కూడా ఆయన కుంటుతూ నడిచారు. ఎంపీ కాళ్ళకు దెబ్బలు తగిలినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. రఘురామకృష్ణంరాజుకు అత్యవసర వైద్యం అందించాలంటూ పిటీషన్లు దాఖలు చేశారు. దీంతోపాటు బెయిల్ పిటీషన్ కూడా వేశారు.

Next Story
Share it