Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు

జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు
X

సీబీఐ ప్రత్యేక కోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను విచారణ కు స్వీకరించిన కోర్టు ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటీషన్ పై మే7న విచారణ జరగనుంది.

జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని..ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు జగన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

Next Story
Share it