Telugu Gateway
Andhra Pradesh

ఏపీ స‌ర్కారు తేనీటి విందులో సీజెఐ ర‌మ‌ణ‌, సీఎం జ‌గ‌న్

ఏపీ స‌ర్కారు తేనీటి విందులో సీజెఐ ర‌మ‌ణ‌, సీఎం జ‌గ‌న్
X

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్ వి ర‌మ‌ణ‌. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. వీరిద్ద‌రూ ఒకే ఫ్రేములో. నిజంగా ఇది పిక్ ఆఫ్ ద డేనే. గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న సీజెఐ ర‌మ‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం విజ‌య‌వాడ‌లో శ‌నివారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. అంతకుముందు నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్‌ జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

Next Story
Share it