ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెడతారా?

Update: 2021-05-14 16:00 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కరోనా వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఓ ఎంపీపై దేశద్రోహం కేసు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలోనూ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా అన్నారు.

జగన్ పాలనలో ప్రశ్నించే గొంతులకు సంకెళ్ళే బహుమతులుగా వస్తున్నాయన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రగ, ప్రతీకారానికి వాడటం దుర్మార్గం అన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News