సానుభూతితోనే జగన్ గెలుపు

Update: 2019-05-29 07:31 GMT

తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రజల కోపం వల్ల ఓడిపోలేదన్నారు. సానుభూతితోనే జగన్ విజయం సాధించారని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాలనతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మౌలికసదుపాయాల కల్పనకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అంతకు మంచి భిన్నంగా ఆలోచించినట్లు కన్పిస్తోందని అన్నారు. పార్టీ నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.

టీడీపీ నిత్యం ప్రజల మధ్యే ఉందని గుర్తుచేశారు. టీడీఎల్పీ నేతగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ నేతల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓడిపోయామని చింతించాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించినా ఇప్పుడు రెండోసారి కూడా అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుదామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు కోరారు.

 

Similar News