Telugu Gateway
Top Stories

ఒత్తిడి లో ఇన్వెస్టర్లు

ఒత్తిడి లో ఇన్వెస్టర్లు
X

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతారణం పెరుగుతుండటంతో భారతీయ మార్కెట్లు ఒత్తిడికి గురి అవుతున్నాయి. మార్కెట్ తొలుత ఈ విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే భారత్ తొలుత కేవలం ఎంపిక చేసిన ఉగ్రవాద క్యాంపు లపైనే టార్గెట్ గా దాడి చేసింది. ఆ తర్వాత కూడా తప్పు చేసిన పాకిస్థాన్ తిరిగి భారత్ పై దాడులకు తెగబడటంతో పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేలా భారత్ దాడులు చేస్తూ పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తోంది. భారత్ పై డ్రోన్లతో అటాక్ చేసేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టడమే కాకుండా పాకిస్థాన్ కు గట్టిగా బదులు చెపుతూ పాకిస్థాన్ ను కకావికలం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈ యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో అన్న భయంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురి అవుతున్నారు.

ఇండియా సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు లేకపోయినా మార్కెట్ మాత్రం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది అనే విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర సమయంలో బిఎస్ఈ సెన్సెక్స్ 550 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 197 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అయితే ఈ టెన్షన్ తాత్కాలికమే అని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. ధరలు తగ్గినప్పుడు మంచి ఫండమెంటల్స్ ఉన్న..మంచి ఫలితాలు ప్రకటించిన కంపెనీల షేర్ల పై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుంది అని మార్కెట్ నిపుణులు చెపుతున్న మాట. అయితే నిన్న మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల వ్యవహారంతో మార్కెట్ లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవి కాస్త సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు యుద్ధ భయాలు మరో సారి మార్కెట్ లో కలకలం రేపుతున్నాయి.

Next Story
Share it