Telugu Gateway
Top Stories

దుబాయ్ దూకుడు..ఆరు నెల‌ల్లో 2.70 కోట్ల మంది ప్ర‌యాణికులు

దుబాయ్ దూకుడు..ఆరు నెల‌ల్లో 2.70 కోట్ల మంది ప్ర‌యాణికులు
X

దుబాయ్..ప‌ర్యాట‌కుల‌కు..షాపింగ్ ప్రేమికుల‌కు ఎంతో ఇష్ట‌మైన ప్ర‌దేశం. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర్యాట‌కులు పెద్ద ఎత్తున ఈ ఎడారి దేశంలో విహ‌రిస్తుంటారు. 2022 సంవ‌త్స‌రం తొలి ఆరు నెల‌ల్లోనే యూఏఈ ఏకంగా 40 వేల కోట్ల రూపాయ‌ల ఆదాయం సాధించింది. ఇదే కాలంలో హోట‌ళ్ల‌లో దిగిన అతిథులు కూడా 1.2 కోట్ల‌కు చేరార‌ని..ఇది 42 శాతం పెరుగుద‌ల న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. ఈ శీతాకాలంలో ప‌ర్యాట‌క రంగం మ‌రింత ముందుకు సాగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు దుబాయ్ పాల‌కుడు షేక్ మెహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్తూమ్ వెల్ల‌డించారు.

న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ ల్లో ఖ‌తార్ ఫిఫా వ‌రల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తున్నందున ప‌ర్యాట‌కుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత బిజీ విమానాశ్ర‌యాల్లో దుబాయ్ ఒక‌టి. ఈ విమానాశ్ర‌యం 2022 సంవ‌త్స‌రం తొలి ఆరు నెల‌ల కాలంలో 27.8 మిలియ‌న్ల (2.70 కోట్ల‌) ప్ర‌యాణికుల‌ను హ్యాండిల్ చేసింది. 2021 సంవ‌త్స‌రం కంటే ఇది ఏకంగా 160 శాతం అధికం కావ‌టం విశేషం. యూఏఈలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ అత్యంత వేగంగా సాగ‌టంతోపాటు..ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌టంతో అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణికుల సంఖ్య కూడా కోవిడ్ పూర్వ‌స్థితికి చేరుకుంటోంది.

Next Story
Share it