Telugu Gateway
Top Stories

టార్స‌న్ ప్రొడ‌క్ట్స్ ఐపీవో 15న ప్రారంభం

టార్స‌న్ ప్రొడ‌క్ట్స్ ఐపీవో 15న ప్రారంభం
X

టార్స‌న్ ప్రొడ‌క్ట్స్. ఈ సంస్థ ప‌రిశోధ‌నా సంస్థ‌లు, విద్యా సంస్థ‌లు, ఫార్మా కంపెనీల‌కు కు అవ‌స‌ర‌మైన ల్యాబ్ ఉత్ప‌త్తుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంది. వైద్య ఆరోగ్య రంగంలో మ‌రింత మెరుగైన ప‌ద్దతుల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ ర‌కాల ఉత్ప‌త్తుల‌ను ఈ కంపెనీ అందిస్తుంది. ఈ సంస్థ ప‌బ్లిక్ ఇష్యూ న‌వంబ‌ర్ 15న ప్రారంభం కానుంది. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన టార్సన్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ 635 రూపాయల నుంచి 662 రూపాయల మ‌ధ్య ఉంటుంద‌ని వెల్ల‌డించింది.

ఈ ఆఫర్‌ సోమవారం, నవంబర్‌ 15,2021 నుంచి బుధవారం, నవంబర్‌ 17,2021 న ముగియ‌నుంది. ఆస‌క్తి ఉన్న వారు క‌నీసం 22 ఈక్విటీ షేర్లతో బిడ్స్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.ఈ ఆఫర్‌లో భాగంగా 1500 మిలియన్‌ రూపాయల విలువ కలిగిన టార్సన్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌కు చెందిన రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేర్లను జారీ చేయనున్నారు. ఈ అమ్మకంలో సంజీవ్‌ సెహగల్‌కు చెందిన 3,90,000 ఈక్విటీ షేర్లు, రోహన్‌ సెహగల్‌కు చెందిన 3,10,000 ఈక్విటీ షేర్లతో పాటుగా క్లియర్‌ విజన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్‌కు చెందిన 12,500,000 ఈక్విటీ షేర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌లో అందించే ఈక్విటీషేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ చేయనున్నారు.

Next Story
Share it