సుప్రీం న్యాయమూర్తి చంద్రచూడ్ కు కరోనా పాజిటివ్
BY Admin12 May 2021 12:53 PM GMT
X
Admin12 May 2021 12:53 PM GMT
సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ కరోనా బారిన పడ్డారు. ఆయన సిబ్బంది లో ఒకరికి కూడా ఇప్పటికే కరోనా వైరస్ సోకింది. అయితే న్యాయమూర్తి కరోనా నుంచి కోలుకుంటున్నారని సమాచారం. కోవిడ్ 19కు సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా విచారిస్తున్న బెంచ్ కు చంద్రచూడ్ నేతృత్వం వహిస్తున్నారు.
ఈ విచారణ సందర్భంగా ఆయన కేంద్ర వ్యాక్సినేషన్ విధానంతోపాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. సోమవారం నాడు కూడా ఆయన ఈ విచారణలో పాల్గొన్నారు. అయితే సాంకేతిక సమస్యలతో ఇది వాయిదాపడిన విషయం తెలిసిందే.
Next Story