Telugu Gateway
Top Stories

కోవిడ్ మ‌ర‌ణాలు..సుప్రీంకోర్టు కీల‌క ఆదేశం

కోవిడ్ మ‌ర‌ణాలు..సుప్రీంకోర్టు కీల‌క ఆదేశం
X

సుప్రీంకోర్టు క‌రోనా మర‌ణాల‌కు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఎంత ఇస్తారు అనేది కేంద్రం ఇష్ట‌మే కానీ..కోవిడ్ మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం మాత్రం చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. కోవిడ్‌ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం బుధ‌వారం నాడు తీర్పు వెల్లడించింది. విపత్తు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై కేంద్రం స్పందిస్తూ.. తమ వద్ద సరిపోయినన్ని నిధులు లేవని కోర్టుకు తెలిపింది.

కేంద్ర వాదనను అంగీకరించని కోర్టు మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇవ్వాలి అనేది కేంద్రమే నిర్ణయించి 6 వారాల్లో విధివిధానాలు తయారు చేయాలని సూచించింది. విపత్తులో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని రికమండేషన్ చేయడంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్ మృతుల కుటుంబాల‌కు నాలుగు ల‌క్షల రూపాయలు చెల్లించాలంటే విప‌త్తు స‌హాయ నిధి నిధులు అన్నీ దీనికే స‌రిపోవ‌ని పేర్కొంది. గ‌తంలో వ్యాక్సినేష‌న్ విష‌యంలోనూ సుప్రీంకోర్టు కొర‌డా ఝ‌ళిపించ‌టంతోనే విధానంలో మార్పులు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు న‌ష్ట‌ప‌రిహారం విష‌యంలోనూ కోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చింది.

Next Story
Share it