Telugu Gateway
Top Stories

భారత్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని..!

భారత్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని..!
X

భారత్ కరోనా నుంచి కోలుకోవాలని ప్రపంచంలోని పలు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. అంతే కాదు..తమ వంతు పెద్ద ఎత్తున సాయం కూడా అందిస్తున్నాయి. భారత్ సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే స్కూల్ ఆఫ్ ఫ్లేవర్స్ సభ్యులు... ప్రే ఫర్ ఇండియా పేరుతో గంట పాటు కెనడా లోని టొరంటో నగరంలో ఎయిర్ షో నిర్వహించారు. సోషల్ డిస్టెన్స్ నియమాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి కోవిడ్ మహమ్మారిని నుండి దేశాన్ని రక్షించాలన్నారు.

కోవిడ్ -19 తో పోరాడుతున్నా మన భారత దేశం త్వరగా తిరిగి మామూలు పరిస్థితులకు రావాలని ఎన్నో కఠిన పరిస్థితులను విపత్తులను తట్టుకొని నిలబడ్డా మన దేశం ఈ ప్రపంచ విపత్తు నుండి కూడా బయటపడాలని ఇందుకు తామంతా ఈ విపత్కర పరిస్థితుల్లో నైతికంగా అండగా ఉన్నామని తెలిపారు. నిసర్గ్ మీడియా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

Next Story
Share it