నిధుల సమీకరణలో కొత్త రికార్డు ఖాయం!

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఐపీవోకి రంగం సిద్ధం అవుతోంది. వాస్తవానికి 2026 మొదటి ఆరునెలల కాలంలోనే ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తి కావాల్సి ఉంది. ఈ మేరకు గతంలో రిలయన్స్ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ లు చేసిన దాడులతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా మార్కెట్లు చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాజాగా శాంతి ఒప్పందం కుదరటం...మార్కెట్ లు తిరిగి గాడిన పడటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఐపీవోకు సంబంధించి సెబీ ముందు పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంది అని..అది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం జరగనున్న జూన్ 19 లోపే ఉండే అవకాశం ఉంది వార్తలు వస్తున్నాయి. ఈ ఐపీవో ద్వారా రిలయన్స్ జియో మార్కెట్ నుంచి దగ్గర దగ్గర 38 వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సమీకరించే అవకాశం ఉంది. దేశంలోనే ఇప్పటివరకు అతి పెద్ద ఐపీవోగా కూడా రిలయన్స్ ఐపీవో నిలవబోతుంది.



