Telugu Gateway
Top Stories

మోడీతో రాకేష్‌ జున్‌జున్‌వాలా భేటీ

మోడీతో రాకేష్‌ జున్‌జున్‌వాలా భేటీ
X

భార‌తీయ వారెన్ బ‌ఫెట్ గా పేరుగాంచిన ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ రాకేష్ జున్ జున్ వాలా మంగ‌ళ‌వారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో స‌మావేశం అయ్యారు. ఆయ‌న ఆకాశ పేరుతో త్వ‌ర‌లోనే ఎయిర్ లైన్స్ ప్రారంభించ‌నున్న త‌రుణంలో ఈ భేటీ ప్రాదాన్య‌త సంత‌రించుకుంది. రాకేష్ జున్ జున్ వాలాతో స‌మావేశం అయిన ఫోటోను ప్ర‌ధాని మోడీ త‌న పేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. రాకేష్ జున్ జున్ వాలాతో స‌మావేశం అవ‌టం ఎంతో సంతోషంగా ఉంద‌ని.. ఆయ‌న భార‌త్ పై ఎంతో బుల్లిష్ గా ఉన్నార‌ని తెలిపారు మోడీ. దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా కోట్లాది రూపాయ‌లు లాభాలు ఆర్జిస్తూ ఎంతో మంది ఇన్వెస్ట‌ర్ల‌లో రాకేష్ జున్ జున్ వాలా ఆస‌క్తి క‌లిగిస్తుంటారు.

Next Story
Share it