Telugu Gateway
Top Stories

రాహుల్ గాంధీ స్టైల్ మార్చారు

రాహుల్ గాంధీ స్టైల్ మార్చారు
X

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో పెద్ద ఎత్తున గడ్డం పెంచారు. దీనిపై కూడా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పెరిగిన గడ్డం తో రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్ లా ఉన్నారు అంటూ అస్సాం సీఎం హిమంతా బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అప్పటిలో దుమారం రేపాయి. తాజాగా రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో న్యూ లుక్ లో కనిపించారు. ఇటీవల ముగిసిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లోనే రాహుల్ గాంధీ పూర్తి గడ్డం తోనే కనిపించారు. అయన 21 వ శతాబ్దం లో వినడం నేర్చుకోవటం అనే అంశంపై మాట్లాడనున్నారు.

రాహుల్ గాంధీ న్యూ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. తొలి దశ భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ త్వరలోనే రెండవ దశ కు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి పునర్వైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ తన వంతు కృషి చేస్తున్నారు. మరీ దీని ఫలితాలు ఎలా ఉంటాయో ఎన్నికల తర్వాత కానీ తేలదు.

Next Story
Share it