Telugu Gateway
Top Stories

సింధుకు ఢిల్లీలో స‌న్మానం

సింధుకు ఢిల్లీలో స‌న్మానం
X

తెలుగు తేజం పీ వీ సింధు మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో సింధుకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్‌ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. సింధు కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్‌ పార్క్‌ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, నిర్మలా సీతారామన్‌, కిషన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఒలంపిక్స్ లో పాల్గొన్న వారికి స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఆహ్వానించారు. దీంతో పాటు సింధు త్వ‌ర‌లోనే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో కూడా స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంది.

Next Story
Share it