Telugu Gateway
Top Stories

మోడీ ఆకస్మిక హైదరాబాద్ పర్యటన లక్ష్యం ఏంటి?

మోడీ ఆకస్మిక హైదరాబాద్ పర్యటన లక్ష్యం ఏంటి?
X

ఊహించని రీతిలో ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ ఆకస్మిక పర్యటన వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. బిజెపి జీహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా కేంద్ర మంత్రులతోపాటు హోం మంత్రి అమిత్ షా కూడా ఒక రోజు రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ తరుణంలో ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే మోడీ ఢిల్లీ నుంచి నేరుగా హాకీంపేట విమానాశ్రయంలో దిగి భారత్ బయోటెక్ యూనిట్ ను సందర్శించనున్నారు.

భారత్ బయోటెక్ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలు సాగుతున్నాయి. మోడీ శనివారం నాడు నగరానికి రానున్నారు. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల తరుణంలో ఈ పర్యటన ఖరారు రావటం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ బయోటెక్ సందర్శన అనంతరం ప్రధాని మోడీ నేరుగా పూణేకు బయలుదేరి వెళ్లనున్నారు.

Next Story
Share it